Sunday, May 19, 2024

సైఫ్ పై ర్యాగింగ్, ల‌వ్ జిహాద్ కేసు న‌మోదు చేయాలి.. బండి సంజ‌య్

సైఫ్ పై ర్యాగింతో పాటు 100శాతం లవ్ జిహాద్ కేసు న‌మోదు చేయాల‌ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. మెడికో ప్రీతి సంఘ‌ట‌న‌పై మాజీ ఎంపీ వివేక్ తో క‌లిసి బండి సంజ‌య్ స్పందించారు. ప్రీతి లాగా చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మెడికో ప్రీతి లాగా చాలా మందిని దుండగులు ఇబ్బంది పెడుతున్నారన్నారు.
కష్టపడి చదివే పిల్లలను కోల్పోవడం బాధాకరమన్నారు. వేధింపులు చేసిన వారిపై ప్రభుత్వానికి, పోలీసులకు జాలి కలుగుతుందన్నారు. హిందూ అమ్మాయిలను వేధిస్తున్నారని, ఇతర దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయని,
టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ మాట్లాడితే మతం అంటున్నారని, నిందితున్ని కాపాడటం కోసమే చిన్న చిన్న నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని బండి సంజ‌య్ ఆరోపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement