Sunday, May 5, 2024

బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి.. బండి సంజయ్

బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఆత్మీయ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యం వల్ల బాణాసంచా నిప్పు రవ్వలు ఇంటిపై పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం పట్ల బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మృతుల, క్షతగాత్రుల కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందించాలన్నారు. బీఆర్ఎస్ నేతల ఆనందం కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా ? అని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement