Tuesday, April 30, 2024

ఏపీలో కరోనా మరణమృదంగం.. ఒక్క రోజులో 64 మృతి

ఆంధ్ర్రప్రదేశ్ లో కరోనా విజృంభన కొనసాగుతోంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా  11,434 మంది కరోనా బారిన పడగా..64 మంది మృతి చెందారు. కోవిడ్ కారణంగా అత్యధికంగా విజయనగరం జిల్లాలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం, తుర్పూగోదావరి, గుంటూరు, నెల్లూరు శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలో 5, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు మరణించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గుంటూరులో 2028, చిత్తూరు జిల్లాలో 1982, నెల్లూరులో 1237, శ్రీకాకుళం జిల్లాలో 1322 కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో ఇప్పటిదాకా 10,54,875 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,47,629 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. ఇంకా 99,446 మందికి కరోనా చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,800కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement