Monday, April 29, 2024

4th Test : మోడీ స్టేడియంలో పరుగుల వరద.. ఆసీస్ స్కోరు 255/4

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు పరుగుల వరద పారించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో ఉస్మాన్ ఖ‌వాజా సెంచ‌రీ పూర్తి చేసి 104 పరుగులతో నాటౌట్ గా ఉండగా, కామెరున్ గ్రీన్ 49 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. అంతకు ముందు స్టీవ్ 38 పరుగులు, ట్రావిస్ హెడ్ 32 పరుగులు పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement