Sunday, April 28, 2024

గంటలో 249కప్పుల టీ..గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన మహిళ

ఒక్క గంటలో 249 కప్పుల టీని తయారు చేసి గిన్నిస్‌ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ లెక్కన ఆమె నిమిషానికి 4 కప్పుల టీ తయారుచేసినట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాలోని వుప్పెర్థల్‌ ప్రాంతానికి చెందిన ఇంగర్‌ వలెంటైన్‌ అనే మహిళ ఈ అరుదైన రికార్డును సాధించారు. తమ దేశంలో పర్యాటక, ట్రావెల్‌ రంగాలను బలోపేతం చేయాలని భావించిన ఆ మహిళ, స్థానికంగా ఎంతో ఫేమస్‌ అయిన ‘రూయ్‌బోస్‌’ అనే టీని తయారు చేసే ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్‌లో ఇంగర్‌ వలెంటైన్‌ మూడు రకాల రుచులు వెనిల్లా, స్ట్రాబెర్రీ, ఒరిజినల్‌ టీని ఉపయోగించి టీ తయారు చేయాలి. ఈ రికార్డు సాధించేందుకు గంట సమయంలో 150 కప్పుల టీని తయారు చేయాల్సి వచ్చింది. ఇందులో ఓ మెలిక కూడా ఉంది. ఒకే పాత్రను ఉపయోగించాలి, కేవలం కొన్ని కప్పులు మాత్రమే వాడాలి. దీంతో ఆ మహిళ ఓ స్ట్రాటజీని వాడారు.. పాత్రలో ఒకేసారి నాలుగు టీ బ్యాగులు వేసి రెండు నిమిషాల పాటు వాటిని కరిగించారు. దానిని నాలుగు కప్పుల్లో పోశారు. ఆ తర్వాత మళ్లీ రిపీట్‌ చేశారు. ఆమెకు స్థానిక విద్యార్థులు సాయంగా నిలిచారు. చేసిన టీ చేసినట్లు తాగుతూ కప్పులు కడిగి మళ్లీ ఇంగర్‌కు అందించే వారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement