Wednesday, May 8, 2024

Breaking: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన మందల కీర్తన్, గోదాం గడ్డకు చెందిన షేక్ సమీర్, మానకొండూరు వైపు నుండి కరీంనగర్ కు వెళ్తుండగా సదాశివ పల్లి స్టేజీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement