Saturday, April 27, 2024

Crime: వ్యక్తి మర్మాంగాన్ని కోసిన యువతి

గుంటూరు జిల్లా తెనాలిలో దారణం జరిగింది. తల్లితో వివాహేతర సంబంధం కొనసాగుతున్న వ్యక్తి మర్మాంగాన్ని కోసింది కూతురు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెంకు చెందిన రామచంద్రారెడ్డి తెనాలిలో మడత మంచాలు అద్దెకు ఇచ్చే లాడ్జీలో ఉంటూ కూలి పనులకు వెళుతుంటాడు. ఇతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.  అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి ఇద్దరూ మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లగా, ఇద్దరూ కలసి మద్యం సేవించారు. డాబాపై నిద్రిస్తున్న సమయంలో రామచంద్రారెడ్డిపై కూతురు విచక్షణరహితంగా దాడి చేసింది. రామచంద్రారెడ్డి మర్మాంగాన్ని (బీర్జాలను) బ్లేడుతో కోసింది.  బాధితుడు పెద్దగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు రామచంద్రారెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement