Monday, April 29, 2024

India Corona: దేశంలో తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2,568 కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి తగ్గుతోంది. నిన్న మొన్నటి వరకు మూడు వేల పై చిలుకు కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,568 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 20 మంది మ‌ర‌ణించారు. గడిచిన 24 గంటల్లో క‌రోనా మ‌హమ్మారి నుంచి మ‌రో 2,911 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 19,137 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,25,41,887 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మొత్తం 5,23,889 మంది కరోనాతో మరణించారు. ఇక, దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.74 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 189.41 కోట్ల క‌రోనా టీకా డోసుల‌ను పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement