Friday, May 3, 2024

FLASH: ట్రాలీ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి,8 మందికి తీవ్ర గాయాలు

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందారిపేట వద్ద కూలీలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాలీలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.

వివరాల్లోకి వెళితే… శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో మిర్చి తోటలో వేరే అందుకు శుక్రవారం ఉదయాన్నే మొగుళ్లపల్లికు చెందిన అశోక్ లేలాండ్ ట్రాలీలో బయలుదేరిన కొద్ది సేపటికే ఎదురుగా వస్తున్న లారీ సైడ్ నుంచి తగలడంతో ట్రాలీలో సైడ్ నిలబడిన వారందరినీ గుద్దుకుంటూ వెళ్లడంతో ఇద్దరు మహిళలు ఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పరకాల ఏసిపి సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎంకు అదే ట్రాలీ లో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement