Friday, April 26, 2024

ప్రాణం తీసిన వేగం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు

మేడ్చల్ జిల్లా కొంపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 9 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. రామాయంపేట నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement