Friday, April 26, 2024

తెలంగాణలో 500 మంది, ఏపీలో 456 మంది

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. దేశవ్యాప్తంగా 18-44 ఏళ్ల లోపు వారికి ఇప్పటివరకు 17,75,540 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో తెలంగాణలో 500 మంది, ఏపీలో 456 మంది మాత్రమే ఉన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తుండగా.. ఇప్పటి వరకు 6 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 2.95 శాతం మందికే వ్యాక్సిన్ దక్కింది. గత 8 రోజుల్లో సగటున రోజుకు 2,21,942 మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 3,82,405 మంది, ఢిల్లీలో 2.99 లక్షల మంది, గుజరాత్‌లో 2.69 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement