Friday, April 26, 2024

అడవిలో అన్నలకు కరోనా..

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అన్ని రంగాల్లో ఉన్న వారిపై కరోనా ప్రభావం చూపిస్తోంది. అయితే తాజాగా  ఛత్తీస్ గఢ్ లో పలుగురు మావోయిస్టులు కరోనా బారిన పడట్లు తెలుస్తోంది. దంతేవాడ, బీజాపూర్, సుకుమా జిల్లాల్లో సుమారు 100 మంది మావోయిస్టులు కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడినవారిలో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు సుజాత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సుజాతపై 25 లక్షల రూపాయలు రివార్డ్ ఉంది. అంతేగాక.. జైలాల్, దినేష్ అనే మావోయిస్టులకు కూడా కరోనా సోకింది. వీరిపై చెరో 10 లక్షల రూపాయల రివార్డ్ ఉంది. అయితే కరోనా ఉన్న మావోయిస్టులు లొంగిపోతే వారికి మంచి వైద్యం అందిస్తామని దంతేవాడ ఎస్పి పిలుపునిచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement