Tuesday, May 7, 2024

ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వారికి కరోనా!

తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మందిని భారత్ కు తరలించింది. మంగళవారం మరో 78 మంది భారత్‌కు వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా మొత్తం 78 మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఇప్పటివరకు 626 మంది భారత్‌కు వచ్చారని కేంద్ర మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి తెలిపారు. అందులో 228 మంది భారతీయులు ఉన్నారని, మరో 77 మంది ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన సిక్కులు ఉన్నారని వెల్లడించారు. మిగిలినివారిలో విదేశీయులతోపాటు భారత ఎంబసీకి చెందినవారు ఉన్నారని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement