Saturday, April 27, 2024

Bad News: ఆర్మీ హెలికాఫ్ట‌ర్ ఘ‌ట‌న‌లో 13మంది మృతి .. బిపిన్​ రావత్​ ఇక లేరు..

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో సీడీసీ చీఫ్​ బిపిన్​ రావత్​ కూడా చనిపోయినట్టు ఎయిర్​ ఫోర్స్​ ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. తొలుత 12మంది చనిపోయారని, రావత్​కు ట్రీట్​మెంట్​ అందిస్తున్నట్టు తెలిపానా.. ఆయన హెల్త్​ కండిషన్​ సీరియస్​గా ఉందని తెలిపారు అధికారులు. అయితే దాదాపు 80శాతానికి పైగా తీవ్ర గాయాలు కావడంతో కాపాడలేకపోయినట్టు తెలిపారు డాక్టర్లు.

ఆర్మీ హెలికాఫ్ట‌ర్ త‌మిళ‌నాడు కునూరు నీల‌గిరి కొండ‌ల్లో ఈరోజు కుప్ప కూలింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో సిడిఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తో పాటు 12మంది చనిపోయారు. కాగా డిఎన్ ఏ ప‌రీక్ష‌ల ద్వారా మృత‌దేహాల‌ను గుర్తించారు. మ‌ర‌ణించిన వారిలో బిపిన్ భార్య కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో బిపిన్ ఒళ్లంతా పూర్తిగా కాలిపోయి ఉంది. హుటాహుటిన బిపిన్ రావత్ ను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినా అతడిని కాపాడలేకపోయామని వైద్యులు చెప్పారు. ముగ్గురు ప్రత్యేక డాక్టర్లు బిపిన్ రావత్ కు వైద్యం అందించారు.. అయినా ఫలితం లేకపోయింది. ఘ‌ట‌నాస్థ‌లాన్ని ఆర్మీ అధికారులు ప‌రిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement