Saturday, April 27, 2024

India Corona: 98.22కి చేరిన రిక‌వ‌రీ రేటు.. దేశంలో కొత్త కరోనా ఎన్నంటే..

దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 11,903 క‌రోనా కేసులు నమోదు అయ్యాయి. క‌రోనాతో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో క‌రోనా నుంచి 14,159 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 1,51,209 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.22 శాతంగా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 3,43,08,140కు చేరింది. ఇందులో 3,36,97,740 వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో మృతుల సంఖ్య 4,59,191కు చేరింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 61.12 కోట్ల క‌రోనా టెస్టులు చేశారు. నిన్న ఒక్క రోజే దేశంలో 41,16,230 డోసుల‌ వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇప్పటి వరకు 107.29 కోట్ల డోసుల‌ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్ల కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: బస్టాండ్లలో గుట్కా బంద్‌.. ఆర్టీసీ సిబ్బందికి ఎండీ వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement