Sunday, May 5, 2024

పోలీసుల ముందే రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే భార్య

అనంతపురం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే భార్య పోలీసుల ముందే రెచ్చిపోయారు. రాయదుర్గం 16వ వార్డు పోలింగ్ బూత్ సమీపంలో వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య కాపు భారతి హల్‌చల్ చేశారు. తెలుగుదేశం అభ్యర్థి సంపత్ కుమారిని ఆమె బెదిరించారు. పోలీసుల ముందే ఆమె తీవ్రంగా హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. సంపత్‌కుమారిని పోలీస్ స్టేషన్‌లో వేయిస్తానని బెదిరించడంతో పలువురు ఓటర్లు అభ్యంతరం తెలిపారు.

అటు ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. 6,7,8 ,20 వార్డుల్లో టీడీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement