Saturday, April 20, 2024

క‌ర్నూలులో మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యానికి 49.99 శాతం పోలింగ్…

కర్నూలు – జిల్లాలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంతంగా కొనసాగుతున్న‌ది… జిల్లా మొత్తంలో నేటి మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి 49.99 శాతం నమోదైంది.. కాగా, క‌ర్నూలు ఎంపి సంజీవ్ కుమార్ నగరంలోని లేబర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు..
మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు పోలింగ్ వివ‌రాలు..

  • కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్: 36.07 శాతం
  • నంద్యాల: 43.76 శాతం
  • ఆదోని: 35.83 శాతం
  • ఎమ్మిగనూరు: 52.19 శాతం
  • డోన్: 43.19%
  • ఆత్మకూర్: 58.37%
  • అళ్ల‌గడ్డ: 64.70%
  • నందికోట్కూర్: 54.52%
  • గూడూరు : 66.40%
Advertisement

తాజా వార్తలు

Advertisement