Thursday, May 16, 2024

రాజ్య సభలో బీజేపీ ఎంపీ డిమాండ్‌

అంత‌ర్జాతీయ పురుషుల దినోత్స‌వాన్ని కూడా జ‌రుపుకోవాల‌ని బీజేపీ ఎంపీ సోనాల్ మాన్‌సింగ్ అన్నారు.  అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ్య‌స‌భ‌లో ప‌లువురు మ‌హిళా ఎంపీలు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా  బీజేపీ ఎంపీ సోనాల్ మాన్‌సింగ్ పురుషుల గురించి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచమంతా మ‌హిళా దినోత్సవాన్ని జ‌రుపుకుంటోంద‌ని, అలాంట‌ప్పుడు పురుషుల దినోత్స‌వాన్నీ జ‌రుపుకోవాల్సిన అవ‌సరం ఉంద‌ని చెప్పారు. న‌వంబ‌రు 19న అంత‌ర్జాతీయ పురుషుల దినోత్స‌వం ఉందని ఆ రోజును ఎవరు కూడా స‌రిగ్గా ప‌ట్టించుకోవడం లేదన్నారు ఎంపీ సోనాల్ మాన్‌సింగ్.
 

Advertisement

తాజా వార్తలు

Advertisement