Sunday, May 19, 2024

Breaking: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌.. 7 ఓవ‌ర్ల‌కు 49 ప‌రుగులు

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో దాదాపు గెలిచినంత పని చేసిన ఆ జట్టు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన విండీస్ సారధి నికోలస్ పూరన్ మాట్లాడుతూ.. తమ జట్టులో మోటీ ఆడటం లేదని, అతని స్థానంలో హేడెన్ ఆడుతున్నాడని వెల్లడించాడు. ఇక‌.. 7 ఓవ‌ర్ల‌కు విండీస్ 49 ప‌రుగులు చేసింది.

100వ వన్డే ఆడుతున్న షాయి హోప్ ఫామ్‌లేమిపై మాట్లాడుతూ.. హోప్ స్కోరు చెయ్యకపోతే మరొకరు చేస్తారని, అతను ఆటను ఆస్వాదిస్తే చాలని అన్నాడు. అదే సమయంలో భారత జట్టులో కూడా ఒక మార్పు జరిగినట్లు ధవన్ చెప్పాడు. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ఆవేష్ ఖాన్ అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు.

భారత జట్టు: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ఆవేష్ ఖాన్

వెస్టిండీస్ జట్టు: షాయి హోప్, కైల్ మేయర్స్, షామ్రా బ్రూక్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, రోవ్‌మెన్ పావెల్, రొమేరియో షెఫర్డ్, అకీల్ హుస్సేన్, హేడెన్ వాల్ష్, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement