అడిలైడ్: యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆసీస్ స్టార్ ఓపెనర్ వార్నర్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 94పరుగులు చేసిన వార్నర్ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మొదటి టెస్టును నాలుగోరోజే ఆసీస్ గెలుచుకోవడంలో వార్నర్ తనవంతు పాత్ర సమర్థంగా పోషించాడు. గాయంతో తప్పుకోవడంతో వార్నర్ స్థానంలో ఉస్మాన్ ఖవాజా జట్టులో చేరనున్నాడు.
కాగా ఐదుటెస్టుల యాషెస్ సిరీస్లోని రెండో టెస్టు అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య డిసెంబర్ 16న జరగనుంది. వార్నర్తోపాటు ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ కూడా గాయంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. కమిన్స్ సారథ్యంలోని ఆసీస్ జట్టు ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital