Wednesday, May 15, 2024

ఐపీఎల్ లో కోహ్లీ ఓపెనింగ్ చేస్తాడు: మైక్ హెస్సన్

స్టార్ బ్యాట్స్ మెన్ కింగ్ కోహ్లీ ఇకపై ఐపీఎల్ లో ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్ వెల్లడించారు. అంతేకాదు ఈ ఐపీఎల్ సీజన్‌లో తాను ఓపెనింగ్ చేస్తానని గత వారం కోహ్లీ కూడా స్పష్టంగా చెప్పాడు. ఐపీఎల్ మినీ వేలం కంటే ముందే దీనిపై మాట్లాడామని, దానికి అనుగుణంగానే వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశామని చెప్పారు మైక్ హెస్సన్. ఈ ఏడాది టోర్నీలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ దేవ్‌దత్ పడిక్కల్‌తో కలిసి విరాట్ ఓపెనింగ్ చేస్తాడని, దీనివల్ల లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా సరిగ్గా సరిపోతుందని మైక్ అభిప్రాయపడ్డారు. విరాట్ ఇంతకముందు కూడా బెంగళూరు తరఫున ఓపెనింగ్ చేశాడు. క్రిస్ గేల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు కోహ్లీ. అప్పుడు కూడా కోహ్లీ అద్భుతంగా ఆడాడు. కోహ్లీ ఓపెనింగ్ కి రావడంతో ఓ సమస్యను ఆర్సీబీ తీర్చుకున్నట్లే. అన్ని భాగానే ఉన్న ఈసారైనా ఆర్సీబీ కప్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement