Monday, May 13, 2024

ప్రభుత్వ ఆదాయం పెంచే దిశగా ప్ర‌భుత్వ ఖాళీ స్థలాలు – మంత్రి పేర్నినాని

మచిలీపట్నంలో జిల్లా పరిషత్తు ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం శుభ పరిణామమని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తో కలిసి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సంద‌ర్బంగా నాని మాట్లాడుతూ, ఆదాయం పెంచుకునేందుకు ఇలా చేయ‌డం అభినందించ‌త‌గ్గ విష‌య‌మ‌న్నారు.. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఖాళీ స్థలాలను ఆదాయ వనరులుగా మార్చటం చాలా శుభపరిణామం అన్నారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో సూర్య ప్రకాష్, ఆర్డీఓ ఎన్ .ఎస్ .కె ఖాజావలీ పంచాయతీరాజ్ ఇ.ఇ,డి.ఇ,ఏఈ ఇతర అధికారులు, సిబ్బంది, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement