Tuesday, April 30, 2024

ప్రపంచ కప్‌ భారత్‌దే.. స్ప‌ష్టం చేసిన‌ డివిలియర్స్‌

టీ20 ప్రపంచకప్‌ విజేత ఎవరన్నదానిపై దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ ఎబి డివిలియర్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను ఫేవరెట్‌గా పేర్కొన్నాడు. సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌, భారత్‌ విజయం సాధిస్తాయని, ఫైనల్స్‌లో టీమిండియా కప్‌ ఎగరేసుకు పోతుందని పేర్కొన్నాడు. భారత జట్టులో సూర్యకుమార్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడని, కోహ్లీ, రోహిత్‌ రాణిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో పోరు సంక్లి ష్టమే. ఈ మ్యాచ్‌ గెలిస్తే ఫైనల్లో విజయం టీమిండియాదే అవుతుందని జోస్యం చెప్పాడు. బౌలింగ్‌ దళం కూడా బాగుందని, అర్షదీప్‌ (10), హార్దిక్‌పాండ్యా (8), షమి (6), భువీ (4), అశ్విన్‌ (6) వికెట్లు పడగొట్టారని డివిలియర్స్‌ ప్రస్తావించారు. ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌శర్మ మెరుపు శుభారంభాన్ని ఇస్తే టీమిండియా భారీ స్కోరు ఖాయమని అన్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement