Sunday, May 5, 2024

Thailand Masters | క్వార్టర్‌‌ఫైనల్స్‌కు ఇండియన్ ప్లేయర్స్‌ !

థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ట్రీసా జాలీ–గాయత్రి, మిథున్ మంజునాథ్, అశ్మిత క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.ఇవ్వాల (గురువారం) జరిగిన మ్యాచ్‌లో ట్రీసా జాలీ-గాయత్రి జోడీ 21-15 24-22 వరుస గేమ్‌లతో తోటి భారతీయులు అయిన తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్పపై విజయం సాధించి మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించారు. తమ తదుపరి మ్యాచ్‌లో.. ఇండోనేషియాకు చెందిన ఫాబ్రియానా ద్విపూజీ కుసుమ-అమాలియా కహాయాతో తలపడనున్నారు ట్రీసా జాలీ–గాయత్రి.

ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో.. మాజీ ప్రపంచ నం.1 కిడాంబి శ్రీకాంత్‌పై 21-9 13-21 21-17తో విజయం సాధించాడు ఓడించిన మిథున్ మంజునాథ్. తన నెక్స్ట్ రౌండ్‌లో నెదర్లాండ్స్ మార్క్ కాల్జౌవ్‌తో తలపడనున్నాడు. సింగిల్స్ విభాగంలో మరో భారతీయుడు ఎస్ శంకర్ ముత్తుసామి సుబ్రమణియన్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సెమీఫైనల్ రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన చున్-యి లిన్ తో తలపడనిన ముత్తుసామి సుబ్రమణియన్ 9-21 11-21తో ఓడిపోయాడు.

ఇక, మహిళల సింగిల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన యు పో పాయ్‌ను 21-12 15-21 21-17తో ఓడించి అశ్మిత తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించింది. అయితే, మాళవికా బన్సోడ్ ప్రీ-క్వార్టర్స్‌లో స్థానిక షట్లర్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్ చేతిలో 22-24 7-21 తేడాతో ఓడిపోయింది. కాగా, తన నెక్స్ట్ రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన ఈస్టర్ నురుమి ట్రై వార్డోయో తో పోరాడనుంది అశ్మిత.

Advertisement

తాజా వార్తలు

Advertisement