Saturday, May 4, 2024

శ్రీలంకలో టీమిండియా ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌

శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ ధవన్ నేతృత్వంలోని భారత జట్టు.. క్వారంటైన్ పూర్తి చేసుకుంది. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో లంకకు బయల్దేరిన టీమిండియా.. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. తాజాగా ఓ ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడింది. కెప్టెన్ ధవన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్‌ల నేతృత్వంలో రెండు జట్లుగా విడిపోయి ఈ సన్నాహక మ్యాచ్‌ ఆడుతున్నారు. ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ధవన్‌ జట్టు.. అద్భుతంగా రాణించిందని బీసీసీఐ వర్గాల సమాచారం. కెప్టెన్‌ ధవన్‌(47) తృటిలో హాఫ్‌ సెంచరీ చేజార్చుకోగా, రుతురాజ్ గైక్వాడ్ (63), మనీష్ పాండే(51) అర్థశతకాలతో అదరగొట్టారని తెలుస్తోంది. ప్రత్యర్ధి కెప్టెన్‌ భువనేశ్వర్ కుమార్‌కు రెండు వికెట్ల దక్కాయని సమాచారం. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. కాగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఈనెల 13న జరుగనుంది.

శిఖర్‌ ధవన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), యజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చహర్‌, కృష్ణప్ప గౌతం, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ కుమార్‌(వైస్‌ కెప్టెన్‌), దీపక్‌ చహర్‌, నవదీప్‌ సైనీ, చేతన్‌ సకారియా

ఇది కూడా చదవండి: భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ప్రేక్షకులకు అనుమతి

Advertisement

తాజా వార్తలు

Advertisement