Wednesday, April 24, 2024

గద్వాల జిల్లాలో పిల్లి చేసిన నిర్వాకం

గద్వాల జిల్లాలో ఓ పిల్లి కారణంగా అన్నదాతకు కన్నీరు మిగిలింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం నందిన్నెకు చెందిన రైతు తెలుగు వీరేష్‌ తనపొలంలో యాసంగిలో వరి సాగు చేశాడు. చేతికొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిం చాడు. దీనికి సంబంధించి ఈ నెల 1న బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమయ్యాయి. శనివారం డబ్బు లు డ్రా చేసి బట్టలో చుట్టి గుడిసెలోని సంచిలో భద్రపరిచాడు.

ఈ నేపథ్యంలో సోమవారం దేవుడి పటాల ముందు పూజ చేసి హారతి ఇచ్చాడు. అయితే అక్కడికి వచ్చిన ఓ పిల్లి హారతికి తగలడంతో గుడిసెలో మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పేసి నప్పటికీ అప్పటికే దాచుకున్న రూ.లక్ష నగదు దగ్ధమయ్యాయి. పంట పెట్టుబడికి ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద నుంచి తెచ్చిన రూ.50 వేల అప్పు తీరుద్దాం అని భావించే లోపే ఈ ప్రమాదం జరగడంతో బాధిత రైతు వీరేష్‌ ఆవేదన చెందుతున్నాడు.

ఈ వార్త కూడా చదవండి: 12 బాటిళ్ల మద్యం తాగేసిన ఎలుకలు

Advertisement

తాజా వార్తలు

Advertisement