Thursday, April 25, 2024

‘ఆదిపురుష్’ తగ్గేదేలే !!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే ప్రభాస్ రాముడు గా , సీతగా కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్అలీఖాన్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంత భాగం జరిగింది. ఇక కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ మొన్ననే రీస్టార్ట్ అయింది.

అయితే ఈ షెడ్యూల్ ను శరవేగంగా జరపాలనే ఆలోచనలో ఓం రౌత్ ఉన్నాడట. అందుకే ప్రతి రోజూ తెల్లవారుజామునే సెట్ కు చేరుకుంటున్నాడట. ప్రభాస్ లేని టాకీపార్ట్ ను కంప్లీట్ చేయాలని ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట. ఇక వచ్చే ఏడాది ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. మరి చూడాలి అనుకున్న సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేస్తారో లేదో.

Advertisement

తాజా వార్తలు

Advertisement