Monday, May 6, 2024

Breaking: ఐసీసీ టీ20 వరల్డ్​ కప్​.. టీమిండియాపై సఫారీల విజయం

సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్​లో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. సెకండ్స్​ ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన సఫారీలు తొలి మూడు ఓవర్లలోనే 2 కీలక వికెట్లు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్​ బావుమా కూడా అవుటయ్యాడు. అయితే.. భారత్​ నిర్ధేశించిన 134 పరుగుల టార్గెట్​ని 5 వికెట్లు కోల్పోయి సఫారీలు విజయం సాధించారు.

ఇందులో మార్కరమ్​ (52), డేవిడ్​ మిల్లర్​ 59* పరుగులతో ఆకట్టకున్నారు. ఇక.. టీమిండియా బౌలర్లలో అర్షదీప్​ సింగ్​ 2, మహ్మద్​ షమీ, హార్దిక్​ పాండ్యా, అశ్విన్​ తలా ఒక వికెట్​ పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement