Friday, April 26, 2024

షిరిడీ సాయి స‌న్నిధిలో రాబ‌ర్ట్ వాద్రా.. బాబా పాదాల‌కు అభివంద‌నం!

షిరిడీ (ప్రభ న్యూస్): కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంకా గాంధీ భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రా ఇవ్వాల (ఆదివారం) షిరిడీ వ‌చ్చారు. సాయిబాబా ద‌ర్శ‌నం చేసుకుని బాబా పాదాల‌కు న‌మ‌స్క‌రించారు. ఈ సంద‌ర్భంగా సంస్థాన్ సీఈవో భాగ్య‌శ్రీ బ‌నాయ‌త్ రాబ‌ర్ట్ వాద్రాకు సాయి విగ్ర‌హం ఇచ్చి స‌త్క‌రించారు. కాగా, వాద్రా వెంట స్థానిక కాంగ్రెస్ నేత డాక్ట‌ర్ ఏక్‌నాథ్‌, షిరిడీ సంస్థాన్ ట్ర‌స్ట్ మాజీ మెంబ‌ర్ అవినాశ్ త‌దిత‌రులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement