Sunday, April 28, 2024

Johannesburg: సౌతాఫ్రికా వర్సెస్ భారత్ తొలి వన్డే

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మూడు వన్డే మ్యాచ్ లు జరుగుతాయి. జోహన్నెస్‌బర్గ్‌లో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు తొలి వన్డే ప్రారంభమవుతుంది.

కేఎల్ రాహుల్ సారథ్యంలో విజయమే లక్ష్యంగా టీమిండియా జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయంపై తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ క్లారిటీ ఇచ్చారు. రింకూ సింగ్ తో పాటు సంజూ శాంసన్ కూడా తది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాహుల్ మీడియాతో తెలిపారు. ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్సీపై పోటీ కొనసాగుతుంది.

భారత్ జట్టు (అంచనా) ..
రుతురాజ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్/ సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్ దీప్ యాదవ్, ముకేశ్ కుమార్.

దక్షిణాఫ్రికా జట్టు (అంచనా) ..
హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, డసెన్, మార్ క్రమ్, క్లాసెన్, మిల్లర్, ఫెలుక్వాయో, ముల్డర్, బర్గర్, షంసి, విలియమ్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement