Tuesday, April 30, 2024

Encounter: ఛ‌త్తీస్ గ‌డ్‌లో మావోయిస్టుల దాడి.. ఎస్ఐ మృతి

చ‌త్తీస్‌గ‌డ్‌లో మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో ఎస్ఐ సుధాక‌ర్‌రెడ్డి అక్క‌డిక్క‌డే మృతి చెందాడు. ఆదివారం ఉదయం సుక్మా జిల్లాలోని బెద్రెలో వారాంతపు అంగడిలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు దాడిచేశారు.

ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి అక్కడికక్కడే చనిపోగా కానిస్టేబుల్‌ రాము తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంద‌ని సుక్మా జిల్లా పోలీసులు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా తెలిపారు. గాయపడిన రాముకు జవాన్లు ప్రాథమిక చికిత్స అందించారని.. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో బెద్రెలోని ఆస్ప‌త్రికి తరలించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement