Tuesday, April 30, 2024

Visakhapatnam : రిష‌బ్ కు షారూఖ్ అత్మీయానందం…

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. నిన్న(బుధవారం) విశాఖ వేదికగా జరిగిన కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ డిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు షారుఖ్ హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం మైదానంలో అడుగుపెట్టిన ఆయన కెకెఆర్ ఆటగాళ్లతోనే కాదు డిల్లీ ప్లేయర్స్ తో ఆత్మీయంగా మాట్లాడుతూ కనిపించారు.

మరీముఖ్యంగా రిషబ్ పంత్ ఆటతీరుకు ముగ్దుడైన షారుఖ్ అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సీన్ అటు కెకెఆర్, ఇటు డిసి ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. అలాగే షారూఖ్ కుమార్తె సుహానా సైతం రిష‌బ్ ను అభినందించింది..
కెకెఆర్ వర్సెస్ డిల్లీ మ్యాచ్ ను షారుఖ్ బాగా ఆస్వాదించారు. ఇరుజట్ల బ్యాటింగ్ సమయంలోనూ ఆయన హుషారుగా కేరింతలు కొడుతూ కనిపించారు. ముఖ్యంగా రిషబ్ పంత్ కళలుచెదిరే షాట్లతో కెకెఆర్ బౌలర్లపై విరుచుకుపడుతుంటే అతడిని అభినందించకుండా వుండలేకపోయారు. రిషబ్ బ్యాటింగ్ సమయంలో షారుఖ్ చప్పట్లు కొడుతూ కనిపించారు.

- Advertisement -

అ మ్యాచ్ కోసం విశాఖపట్నం విచ్చేసిన షారుఖ్ ఖాన్ సందడి చేసారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న షారుఖ్ కు ఘనస్వాగతం లభించింది. షారుఖ్ ను చూసేందుకు అభిమానులు భారీగా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేసి షారుఖ్ ను నోవాటెల్ కు తీసుకువెళ్లారు. నిన్న కెకెఆర్ వర్సెస్ డిసి మ్యాచ్ కు హాజరైన షారుఖ్ రాత్రి నోవాటెల్ లోనే బసచేసారు. ఇవాళ కూడా విశాఖలోనే వుండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న షారుఖ్ సాయంత్రం ముంబైకి బయలుదేరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement