Sunday, April 28, 2024

SA vs Ind 2nd ODI : సౌతాఫ్రికా టార్గెట్..212 పరుగులు

సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా జట్ల మధ్య ఇవాళ సెకండ్ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు ఆశించినంత స్కోర్ చేయలేకపోయింది. 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

భారత్ బ్యాట్స్ మెన్లు సాయి సుదర్శన్ 62 పరుగులు, కేఎల్ రాహుల్ 56 పరుగులు, అర్షదీప్ సింగ్ 18 పరుగులు, రింకూ సింగ్ 17 పరుగులు చేశారు. ఇద్దరు బ్యాట్స్ మెన్లు తప్ప మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయకపోవడంతో టీమిండియా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికాకు తక్కువ టార్గెట్ ను ఇచ్చింది. దీంతో సౌతాఫ్రికా విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 212 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement