Tuesday, May 7, 2024

Quick Action – శ్రీకాకుళం నుంచి తిరుప‌తికి గుండె త‌ర‌లింపు…జ‌గ‌న్ కు రోగి బంధువులు కృత‌జ్ఞ‌త‌లు

తిరుపతి: అత్య‌వ‌స‌రంగా ఓ రోగికి గుండె మార్పిడి ఆప‌రేష‌న్ చేయాల్సి రావ‌డంతో అత్యంత వేగంగా ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్పందించారు.. అఘ‌మేఘాల మీద గ్రీన్ ఛాన‌ల్ కు ఆదేశాలు జారీ చేశారు.. నిమిషాల వ్య‌వ‌ధిలో శ్రీకాకుళం జిల్లాలోని రాగోలు జెమ్స్ మెడిక‌ల్ క‌ళాశాల నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ ద్వారా గుండెను విశాఖ ఎయిర్ పోర్టుకు త‌ర‌లించారు.. అక్క‌డి నుంచి ప్ర‌త్యేక విమానంలో తిరుప‌తికి ఆ గుండెను కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలోనే చేర్చారు..

రేణిగుంట విమానాశ్ర‌యం నుంచి ప‌ద్మావ‌తి హాస్ప‌ట‌ల్ కు గ్రీన్ ఛాన‌ల్ ఏర్పాటు చేయ‌డంతో విమానం వ‌చ్చిన వెంట‌నే ప్ర‌త్యేక అంబులెన్స్ లో గుండెను కేవ‌లం 11నిమిషాల‌లో హాస్ప‌ట‌ల్ కు చేర్చారు… అనంత‌రం వైద్యులు విజ‌య‌వంతంగా రోగికి గుండె మార్పిడి చేశారు.. ఇందుకు అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాలు అందించిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు, ఎవియేష‌న్ సిబ్బందికి, పోలీస్ శాఖ‌కు రోగి బంధువులు, వైద్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement