Tuesday, May 7, 2024

చరిత్రాత్మక సిరీస్‌పై డాక్యుమెంటరీ… ట్రైలర్‌ విడుదల

ముంబై: ఆస్ట్రేలియా గడ్డపై 2020-21లో భారత్‌- ఆసీస్‌ మధ్య జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఈ చరిత్రాత్మక సిరీస్‌ను బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్‌ పాండే డాక్యుమెంటరీగా రూపొందించనున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను టీమిండియా క్రికెటర్లు అజింక్యా రహానె, మహ్మద్‌ సిరాజ్‌, హనుమ విహారి, రవిచంద్రన్‌ అశ్విన్‌, చతేశ్వర్‌ పుజారా విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీని నీరజ్‌ పాండే ”బంధన్‌ మే తా ధమ్‌” పేరుతో నిర్మించాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో జరిగిన సంఘటనలను అంశాలుగా తీసుకొచ్చి… మధ్యమధ్యలో రహానే, సిరాజ్‌లు తమ అనుభవాలను పంచుకునేలా ట్రైలర్‌ను రూపొందించారు. జూన్‌ 16 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ప్లామ్‌ ”వూట్‌ సెలెక్ట్‌”లో సిరీస్‌ ప్రసారం కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement