Thursday, May 9, 2024

మలేషియా ఓపెన్ గెలిచిన పీవీ సింధు.. సైనానెహ్వాల్‌ పరాజయం

కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా ఓపెన్‌ సూపర్‌ 750 బాడ్మింటన్‌ టోర్నీలో బుధవారంనాడు భారత్‌ క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు సాధించారు. ప్రఖ్యాత షట్లర్‌ పీవీ సింధు తొలి పోటీల్లో విజయం సాధించి ముందుకు దూసుకుపోగా మరో దిగ్గజ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ పరాజయంపాలైనారు. ధాయ్‌లాండ్‌కు చెందిన వరల్డ్‌ నెంబర్‌ 10 క్రీడాకారిణి పోర్న్‌పవీ ఖోచువాంగ్‌తో తలపడి 21-13, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది.

కాగా మరో పోటీలో అమెరికాకు చెందిన ఐరిస్‌ వాంగ్‌ చేతిలో సైనా నెహ్వాల్‌ 21-11, 21-17 తేడాతో ఓటమి పాలైనారు. కాగా డబుల్స్‌ విభాగంలో భారత్‌కు చెందిన సుమీత్‌ రెడ్డి, అశ్విని పొన్నప్ప జోడీ నెదర్లాండ్స్‌కు చెందిన రోబిన్‌ తబెలింగ్‌, సెలెన పీక్‌ జోడీతో తలపడి 15-21 21-19, 17-21 తేడాతో ఓటమి పాలైనారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement