Saturday, May 4, 2024

Para Badminton World | భారత్‌కు 3 స్వర్ణాలు

పారా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు పతకాల పంట పండించారు. 3 స్వర్ణాలు, 4 రజతాలు, 11 కాంస్యాలతో మొత్తం 18 పతకాలు కైవసం చేసుకున్నారు. థైలాండ్‌లో జరిగిన ఈ పారా బ్యాడ్మింటన్‌ పోటీల్లో సుహాస్‌ యతిరాజ్‌, ప్రమోద్‌ భగత్‌, కృష్ణ నాగర్‌ బంగారు పతకాలు గెలుచుకున్నారు.

ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-4 విభాగంలో ఫైనల్స్‌లో సుహాస్‌ యతిరాజ్‌ 21-18, 21-8 తేడాతో ఇండోనేషియాకు చెందిన సెటివాన్‌ను వరుస గేముల్లో చిత్తు చేశాడు. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-3 ఫైనల్స్‌లో ప్రమోద్‌ భగత్‌ 14-21, 21-15, 21-14తో ప్రపంచ నెం.ృ డానియల్‌ బెథెల్‌ (ఇంగ్లండ్‌)పై సంచలన విజయం సాధించాడు. ఎస్‌హెచ్‌-6 విభాగం ఫైనల్స్‌లో కృష్ణ నాగర్‌ 22-20, 22-20 తేడాతో నైలీ లీన్‌ (రిపబ్లిక్‌ చైనా)పై చెమటోడ్చి నెగ్గాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement