Monday, April 29, 2024

ఐసీసీ ర్యాంకింగ్​లో పాక్​ బెటర్​మెంట్​.. ఇండియాకంటే పైపైకి..

వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్థాన్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టును వెనక్కి నెట్టి పైకి ఎగబాకింది. దీంతో భారత జట్టు ఐదో స్థానానికి పరిమితమైంది. విండీస్‌తో సిరీస్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ 102 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండడేది. కానీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో 106 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది.

ప్రస్తుతం భారత్ ఖాతాలో 105 పాయింట్లు ఉన్నాయి. 125 పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా.. 124 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో.. 107 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement