Saturday, April 27, 2024

Big Breaking | ఆరెంజ్ ఆర్మీ ఫుల్ జోష్‌.. ఉప్ప‌ల్ స్టేడియంలో స‌న్ రైజింగ్‌!

ఐపీఎల్ 2024లో భాగంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్‌, ముంబ‌యి ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు.. ముంబ‌యి ముందు అతి పెద్ద టార్గెట్‌ని పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ జ‌ట్టు కూడా ఇంత పెద్ద మొత్తం టార్గెట్ సెట్ చేయ‌లేదు. ప‌దేండ్ల క్రితం బెంగ‌ళూరు జ‌ట్టు పేరు మీద ఉన్న 263 ప‌రుగులు రికార్డుని హైద‌రాబాద్ దాటేసి 277 ప‌రుగులు చేసింది.

ఇక‌.. చేజింగ్‌కు దిగిన ముంబ‌యి జ‌ట్టు కూడా తామేమీ తక్కువ కాద‌న్న‌ట్టు ఆరంభంలోనే దూకుడు పెంచింది. 200వ మ్యాచ్ ఆడిన రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ చేయ‌డం గ‌మ‌నార్హం.. అయితే.. 3 ఓవ‌ర్ల‌లోనే 50 ప‌రుగులు దాటేసిన ముంబ‌యి జ‌ట్టు.. అంత‌లోనే ఇషాన్ కిష‌న్ వికెట్ పోగొట్టుకుంది. దీంతో రోహిత్‌, న‌మ‌న్ క‌లిసి స్కోరు బోర్డుని ప‌రుగులు పెట్టించారు. ఈ క్ర‌మంలో రోహిత్ 26 ప‌రుగుల వ‌ద్ద అవుట‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన తిల‌క్ వ‌ర్మ బౌండ‌రీలు బాదుతూ ముంబ‌యి అభిమానుల్లో ఆశ‌లు పెంచాడు. అయితే.. 64 ప‌రుగుల వ‌ద్ద తిల‌క్ క‌మిన్స్ బౌలింగ్‌లో దొరికిపోయి పెవిలియ‌న్ చేరాడు.. ఇక‌.. ఆ త‌ర్వాత ఆట కాస్త స్లో అయ్యింది.. టార్గెట్ చేజ్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో వ‌చ్చిన బ్యాట్స్‌మ‌న్ ఒత్తిడికి గుర‌య్యారు. దీంతో ఒక్కొక్క‌రు అవుట‌వుతూ పెవిలియ‌న్ చేరారు. మొత్తం 5 వికెట్ల న‌ష్టానికి ముంబ‌యి 246 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఈ క్రమంలో హైదరాబాద్​ జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

- Advertisement -

అంత‌కుముంది.. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ జట్టు ముంబ‌యిని ఊచ‌కోత కోసింది. ముంబ‌యి బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టి కొత్త రికార్డు సృష్టించారు. ఇక‌.. ఓపెన‌ర్లు మ‌యాంక్ అగ‌ర్వాల్‌, ట్రావిస్ హెడ్ ఊపుమీద ప్రారంభించ‌గా.. కొద్దిసేప‌టికి మ‌యాంక్ 11 ప‌రుగుల‌కు అవుట‌య్యాడు. దీంతో క్రీజులోకి అభిషేక్ శ‌ర్మ వ‌చ్చాడు.. ఇక‌.. ట్రావిస్‌తో జ‌త క‌లిసి ఇద్ద‌రూ ముంబ‌యిని ఊచ‌కోత కోశారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 7 ఓవ‌ర్ల‌లో 100 ప‌రుగులు దాటించారు. ఆ త‌ర్వాత హెడ్ (62) వ‌ద్ద అవుట‌వ్వ‌గా అయిడెన్ మార్క్ర‌మ్ వ‌చ్చి అదే ఊపులో దంచికొట్టాడు. కాగా, అబిషేక్ 16బంతుల్లోనే 50 ప‌రుగులు చేసి రికార్డు సాధించాడు.. ఇక‌.. 63 ప‌రుగుల వ‌ద్ద అవుట‌వ్వ‌డంతో క్లాసెన్ వ‌చ్చి ఉతికి ఆరేశాడు.. క్లాసెన్ 80, మార్క్రమ్ 42 ప‌రుగుల‌తో నాటౌట్‌గా ఉన్నారు. 20 ఓవ‌ర్ల‌లో 277 ప‌రుగులు చేసి ఇంత‌కుముందు ఆర్‌సీబీ పేరుతో 263 ప‌రుగుల రికార్డును బ్రేక్ చేశారు.. ఇక‌.. ముంబ‌యి టార్గెట్ 278 ప‌రుగులుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement