Thursday, April 25, 2024

Basara – రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య

బాసర ( ప్రభ న్యూస్) బాసర రైల్వే ట్రాక్పై ప్రేమ జంట ఆత్మహత్య కలకలం లేపింది.బుధవారం నాగర్సోల్ నుండి నర్సాపూర్ వెళ్లే ట్రైన్ కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువతిగా గుర్తించారు.

నిషిత డిగ్రీ కాలేజీలు చదువుతున్నట్లు ఐడి కార్డు ద్వారా తెలుస్తోంది. మృతుడి వివరాలు తెలియ రావడం లేదు. రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement