Sunday, April 28, 2024

ధావన్ ప్లేస్ రాహుల్ కే… డౌట్ లేదు !!

అహ్మదాబాద్ వేదికగా టీమ్ ఇండియా ఇంగ్లాండ్ కు మధ్య జరుగుతున్న ఐదు టి20 ల సిరీస్ లో మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ గెలుచుకుంది. ఆ తర్వాత మ్యాచ్ ను ఇండియా గెలిచింది. అయితే మొదటి రెండు మ్యాచ్ లలో కూడా ఓపెనర్ కె.ఎల్.రాహుల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక మంగళవారం జరిగిన మూడవ టి-20లో కూడా రాహుల్ అవుటయ్యాడు. మొదటి మ్యాచ్ లో ఒక పరుగు చేసిన రాహుల్.. రెండో మ్యాచ్ లో ఖాతా ఓపెన్ చేయకుండానే వెనుదిరిగాడు. ఇక మూడో మ్యాచ్ లో కూడా ఖాతా ఓపెన్ చేయకుండానే క్రీజు వదిలాడు.

దీంతో సోషల్ మీడియాలో ట్రోల్ మొదలయ్యాయి. అయితే మొదటి మ్యాచ్ లో ఫెయిల్ అయిన ఓపెనర్ ధావన్ ను తప్పించి రెండవ మ్యాచ్ కి యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ను తీసుకువచ్చారు. కాగా మ్యాచ్ నుంచి ధావన్ ను తప్పించడం పట్ల ఓ ఫోటోను పెట్టి ట్రోల్ చేశారు నెటిజన్లు. ఇక ఇప్పుడు ధావన్ ప్లేస్ లో రాహుల్ కూడా వచ్చేస్తాడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలో కె.ఎల్.రాహుల్ విరాట్ కోహ్లీ భుజాలపై ఎత్తుకుని ధావన్ ను తీసుకువెళ్తారు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లితో పాటు రోహిత్ శర్మ కలిసి రాహుల్ ని తీసుకెళ్లి టైం వచ్చింది అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement