Sunday, April 28, 2024

IPL | కోల్​కతా విన్​.. ఒక్క ఓవర్​లో 5 సిక్స్​లు బాదిన రింకూ సింగ్​

గుజరాత్​ టైటాన్స్​, కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్ల మధ్య ఇవ్వాల జరిగిన మ్యాచ్​ చివరిదాకా ఉత్కంఠను కలిగించింది. క్రికెట్​ అభిమానులను టెన్షన్​కి గురిచేసింది. తొలుత బ్యాటింగ్​ చేసిన గుజరాత్​ జట్టు 204 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన కోల్​కతా బ్యాటర్లు.. దీటుగా ఆడారు. అయితే వరసుగా వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడిపోయారు. ఏడు వికెట్లు కోల్పోయి ఆశలు వదిలేసిన క్రమంలో చివర్లో రింకూ సింగ్​ ఊపిరిపోశాడు. ఆఖరి ఓవర్​లో ఒక సింగిల్​ వచ్చింది.. ఆ తర్వాత రింకూకి చాన్స్​ దక్కింది. వరుసగా 5 సిక్స్​లు కొట్టి జట్టుకి విజయాన్ని అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement