Monday, April 29, 2024

IPL : శ్రేయ‌స్ కు స్లో ఓవ‌ర్ రేట్ వాత…రూ.12 ల‌క్ష‌లు జ‌రిమానా

అసలే ఓటమి బాధలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు మరో పెద్ద షాక్‌ తగిలింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కేకేఆర్‌ జట్టుకు ఐపీఎల్‌ నిర్వహాకులు రూ. 12 లక్షలు జరిమాన విధించారు. కేకేఆర్‌ బౌలర్లు నిర్ణీత సమయంలో తమ బౌలింగ్‌ కోటాను పూర్తి చేయకపోవడంతో వారికి భారీ ఫైన్‌ పడింది.

ఈ సీజన్‌లో ఇది తొలి తప్పిదం కావడంతో రూ. 12 లక్షల విధించినట్టుగా ఐపీఎల్‌ నిర్వహకులు తెలిపారు. మరోసారి ఇది పునరావృతం అయితే కెప్టెన్‌కు రూ. 24 లక్షల ఫైన్‌ పడుతుందని హెచ్చరించారు. కాగా ఈ ఏడిషన్‌లో అయ్యర్‌ కంటే ముందు ఢిల్లిd క్యాపిటల్‌ సారథి రిషభ్‌ పంత్‌, గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ సారథి సంజూ శాంసన్‌లకు కూడా స్లో ఓవర్‌రేట్‌ కారణంగా జరిమాన పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement