Wednesday, May 15, 2024

పెళ్లి పీటలెక్కనున్న భారత మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి

భారత మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి కర్ణాటక బ్యాటర్‌ అర్జున్‌ హోయసాల త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు.ఈ విషయాన్ని వీరిద్దరు సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. తమ ఎంగేజ్‌మెంట్‌ ఫోటోను షేర్‌ చేశారు. వీరిద్దరు త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రికెటర్లు ఇద్దరూ ఈ విషయాన్ని తమ సోషల్‌ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఈ ఫోటోల్లో అర్జున్‌ మోకాళ్లలపై కూర్చుని చాలా రొమాంటిక్‌గా వేదాకు ప్రపోజ్‌ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వేదా.. టీమ్‌ ఇండియా తరపున 48 వన్డేలు, 76 టీ 20ల్లో ప్రాతినిద్యం వహించింది. 2017లో వన్డే ప్రపంచకప్‌ లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులోనూ.. 2020 టీ 20 ప్రపంచకప్‌ జట్టులో కూడ భాగమైంది. కాని కొంతకాలంగా ఆమె భారత జట్టుకు దూరంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement