Friday, April 26, 2024

భారత్ టైట్ బౌలింగ్ – కివీస్ 9 పరుగులకు 3 వికెట్స్ డౌన్

రాయ్‌పూర్‌: న్యూజిలాండ్‌తో జ‌ర‌గనున్న రెండ‌వ వ‌న్డేలో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న‌ది. రాయ్‌పూర్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తొలుత బౌలింగ్ చేయ‌డానికి డిసైడ్ అయ్యాడు. బ్యాటింగ్ కు దిగిన కివీస్ కు రెండో ఓవ‌ర్ లోనే దెబ్బ త‌గిలింది..ష‌మీ వేసిన తొలి ఓవ‌ర్ అయిదో బంతికి కివీస్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ డ‌కౌట్ అయ్యాడు.. ఇక సిరాజ్ తన మూడో ఓవర్ లో నికోలస్ ను పెవిలియన్ కు పంపాడు.. ఆ తర్వాత షమీ తన నాలుగో ఓవర్ లో డెరియల్ మిచెల్ ను వెనక్కి పంపాడు ప్రస్తుతం ఏడు ఓవర్లు ఓవ‌ర్లు ముగిసే నాటికి కివిస్ 3 వికెట్ లు న‌ష్ట‌పోయి 9 ప‌రుగులు చేసింది. కాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఆడిన జ‌ట్టుతోనే టీమిండియా,న్యూజిలాండ్ లు ఈ మ్యాచ్ లో కూడా బ‌రిలోకి దిగాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement