Wednesday, May 22, 2024

World Cup: నేడు భార‌త్‌తో త‌ల‌ప‌డ‌నున్న సఫారీలు

ఇవాళ‌ కోల్‌కతా వేదికగా రెండు కొదమసింహాల పోరుకు సిద్ద‌మ‌య్యాయి. టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో వరుస విజయాలను సాధిస్తూ పాయింట్ల పట్టకలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

ప్రపంచకప్‌లో భారత్‌ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడగా, ఈ మ్యాచ్‌లన్నింటిలోనూ భారత్‌ విజయం సాధించింది. భార‌త్ రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, షమి, బుమ్రా, సిరాజ్‌ల‌తో బ‌రిలో దిగ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement