Friday, April 26, 2024

న్యూజిలాండ్ ప్లేయ‌ర్స్‌పై నోరు పారేసుకున్న ఫ్యాన్స్..

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ ఆటగాళ్లపై ఇద్దరు వ్యక్తులు అనుచిత, జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. భద్రతా సిబ్బంది వెంటనే వారిని మైదానం నుంచి గెంటేశారని తెలిసింది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లను దూషించినట్టు మాకు సమాచారం అందింది. వారిని మా భద్రతా సిబ్బంది గుర్తించి మైదానం నుంచి గెంటేశారు. క్రికెట్లో దూషణ, వివక్షతో కూడిన ప్రవర్తనను మేం అస్సలు ఉపేక్షించం’ అని ఐసీసీ ప్రకటించింది. ‘ఆ ఇద్దరు వ్యక్తులు బ్లాక్‌ ఎంలో కూర్చున్నారు. రెండు జట్లు బస చేస్తున్న హోటల్‌ కిందనే ఆ సీట్లు ఉంటాయి’ అని ఈఎస్‌పీఎన్‌ ద్వారా తెలిసింది. ఆ వ్యక్తులు దూషణ సాధారణ, జాతి వివక్షతో కూడిందని సమాచారం. సోషల్‌ మీడియా ద్వారా కొందరు అభిమానులు ఈ విషయం తెలియగానే ఐసీసీ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసింది. వెంటనే చర్యలు తీసుకుంది. కివీస్‌ బ్యాటర్‌ రాస్‌ టేలర్‌ను ఉద్దేశించే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

జాతి వివక్ష వ్యాఖ్యల సంగతి తమకు తెలియదని న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అన్నాడు. నేనూ ఇప్పుడే దీని గురించి విన్నాను. ఫీల్డ్‌లో ఆట‌ను మంచి స్పిరిట్‌తో ఆడాలి అని అన్నాడు. మైదానం ఆవల ఏం జరిగిందో మాకైతే తెలియదు’ అని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement