Tuesday, April 16, 2024

మంచిర్యాలలో పశువులపై పెద్దపులి పంజా!

మంచిర్యాల జిల్లా ప్రజలను పులులు హడలెత్తిస్తున్నాయి. వరుస దాడులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల దాడులు చేసిన పులులు తాజాగా పెంచికల్ పేట మండ‌లం లోడ్ప‌ల్లి గ్రామ స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో బీభ‌త్సం సృష్టించింది. మేత‌కు వెళ్లిన ప‌శువుల‌పై ఓ పులి దాడి చేసింది. ఈ దాడిలో మూడు ప‌శువులు మృతి చెందాయి. ఈ ఘటనపై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి సంచారంపై నిఘా పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement