Tuesday, May 14, 2024

India Open | మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న సెమీఫైనల్స్ !

ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ 750 టోర్నీలో ఇవ్వాల సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, మరి కొద్ది సేపట్లో ప్రానంభం కానున్న మెన్స్ సింగిల్స్ పోరులో భారత స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ చైనీస్ ప్లేయర్ షి యుకీతో తలపడనున్నాడు. నిన్న (శుక్రవారం) జరిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లో తైవాన్‌కు చెందిన వాంగ్ త్జు వీపై 21-17, 17-21, 21-19తో విజయం సాధించి సెమీఫైనల్స్‌లో ప్ర‌వేశించాడు ప్ర‌ణ‌య్.

ఇక మెన్స్ డబుల్స్‌లో భారత్ స్టార్ ద్వయం సాత్విక్ – చిరాగ్ లు సెమీఫైనల్‌లో మలేషియన్ జోడీ అయిన W.Y. సో – ఎ. చియాలతో తలపడనున్నారు. ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో సాత్విక్‌– చిరాగ్ లు 21-7, 21-10తో డెన్మార్క్ ప్రత్యర్థులు కిమ్ ఆస్ట్రప్ – ఆండర్స్ స్కారప్ రాస్‌ముస్సేన్‌లను చిత్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement