Sunday, April 28, 2024

Idupulapaya – వైయస్సార్ ఘాట్ లో తండ్రికి షర్మిల ఘన నివాళి..

వేంపల్లి, జనవరి 20 ( ప్రభన్యూస్) :ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కడప జిల్లా ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాటును సందర్శించారు. తన తండ్రి డాక్టర్ వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావుతో కలసి ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ కాన్వాయ్ గా బయలుదేరి ఇడుపులపాయకు వచ్చారు.

పిసిసి అధ్యక్షురాలిగా రేపు విజయవాడలో బాధ్యతలు చేపడుతున్న తరుణంలో షర్మిల తన తండ్రి ఆశీస్సులు తీసుకునేందుకు ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ సందర్శించి తండ్రి డాక్టర్ వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. కాగా డాక్టర్ వైయస్ ఆత్మగా పిలవబడే మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు సుదీర్ఘకాలం తర్వాత వైయస్ సమాధిని సందర్శించారు. షర్మిల తో కలిసి శనివారం తన ఆప్త మిత్రుడు వైయస్ సమాధి వద్దకు చేరుకొని, నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు శైలజనాథ్, ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎన్. తులసి రెడ్డి, మాజీ మంత్రి అహమదుల్లా, మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాసరెడ్డి తోపాటు అనంతపురం, అన్నమయ్య, నంద్యాల తదితర జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొని వైయస్ కు నివాళులు అర్పించారు.

షర్మిల కు అపూర్వ స్వాగతం…

- Advertisement -

అంతకు ముందు వైయస్ షర్మిలకు కడపలో అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమెకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో షర్మిలతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద మాజీ రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి, జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.

దాదాపు 200 వాహనాల్లో కడప విమానాశ్రయం వద్దనుండి పెళ్లిమర్రి, నందిమండలం మీదుగా వేంపల్లి కు ర్యాలీగా చేరుకున్నారు. వేంపల్లి లో బాణాసంచా పేల్చి స్వాగతం పలికారు. అక్కడి నుండి మోటార్ బైక్ ర్యాలీ ముందుగా సాగుతుండగా ఇడపలపాయ స్టేట్ కు చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శైలజానాధ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్, జకరయ్య, ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తారు, అనంతపురం జిల్లా అధ్యక్షులు ప్రతాపరెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అల్లాబకాష్, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్, జిల్లా నాయకులు విష్ణు ప్రితమ్ రెడ్డి, పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి, పూల నజీర్, శర్మ, అమర్నాథరెడ్డి, ధ్రువ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement